ఎర్రజెండా అండగా మరిన్ని పోరాటాలు : తమ్మినేని

by Sridhar Babu |
ఎర్రజెండా అండగా మరిన్ని పోరాటాలు : తమ్మినేని
X

దిశ, కూసుమంచి : కార్మికులకు అండగా ఎర్రజెండా ఉంటుందని రైతు,కార్మిక, శ్రమజీవుల కోసం మరెన్నో పోరాటాలను నిర్మిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో మేడే వారోత్సవాల్లో భాగంగా ఆయన గ్రామం సెంటర్ లో ఎర్రజెండాను ఎగరవేశారు. అనంతరం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రపంచ కార్మికుల ఐక్యత చాటే మేడే రోజును జీళ్ళచెరువు గ్రామంలో అమరవీరులను స్మరించుకుంటూ చేసుకోవడం సంతోషకరమన్నారు.

వారి పోరాటాలను, త్యాగాలతో మరెన్నో పోరాటాలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వ్యవసా య కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే కార్మిక చట్టాలను రద్దు చేసే ప్రమాదం ఉందని, రానున్న రోజుల్లో ప్రజలు మరింత చైతన్యమై మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు చట్టసభల్లో ఉంటే కార్మికుల కోసం, రైతుల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే యూపీఏ వన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 63 మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.

ప్రస్తుతం కేంద్రం బడ్జెట్లో గతం కంటే ఉపాధి హామీ పథకానికి 33 శాతం నిధులు తగ్గించిందని వివరించారు. పార్టీ గ్రామ కార్యదర్శి జానకి రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బండి రమేష్, జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, డాక్టర్ వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, కొండపల్లి మండల కార్యదర్శి కె.వి.రెడ్డి , సీనియర్ నాయకులు శీలం గురుమూర్తి ,మల్లెల సన్మత రావు, తోటకూరి రాజు, గన్య నాయక్, వెంకటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు , పలు గ్రామాల కార్యదర్శులు, పార్టీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.



Next Story