- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ధరణితో భవిష్యత్లో మరింత లబ్ధి : కలెక్టర్ వీసీ గౌతమ్

దిశ, సత్తుపల్లి : భవిష్యత్లో ధరణితో రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ వీసీ గౌతమ్ అన్నారు. సత్తుపల్లి మండలం బేతేపల్లి రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగారం రైతు వేదికలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 7200 మంది రైతులకు ఎన్ఓసీ ఇచ్చినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధరణి పోర్టల్ పనితీరును పరిశీలించడానికి వస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని పలు సర్వేనెంబర్లలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. నారాయణపురం ,పాకల గూడెం, గంగారం, రామనగరం, బేచుపల్లిలో భూ సమస్యల పరిష్కారం 80 శాతం పూర్తయిందని మిగిలిన 20 శాతం పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవోలు సూర్యనారాయణ, ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఎంపీడీఓ సుభాషిని, జెడీపటీసీ సభ్యులు రామారావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, మండల ఎంపీటీసీల అధ్యక్షులు తుంబురు కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.