- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మోడీ రాజీనామా చేయాలి

దిశ ,జూలూరుపాడు : మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటన దేశానికి మాయని మచ్చని ఆయన అభివర్ణించారు. మణిపూర్ ఘటనలను నిరసిస్తూ జూలూరుపాడు మండల పరిధిలో అన్నారుపాడు గ్రామంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మణిపూర్ రాష్ట్ర లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి, హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మణిపూర్ రాష్ట్రంలో మూడు నెలలుగా కుకీలకు, మైతిలకు మధ్య జరుగుతున్న వివాదం మోడీ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని, గిరిజన మహిళలను నగ్నంగా సభ్య సమాజం సిగ్గు పడేలా ఊరేగించి అత్యాచారం చేసి, హత్య చేయటం అనేది ప్రపంచంలో భారత్ సిగ్గుతో తలదించుకునే సంఘటనగా వర్ణించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మోడీ ప్రభుత్వం రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమానికి అన్నారు పాడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ పద్మ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జూలూరుపాడు మండల కార్యదర్శి భానోత్ ధర్మ, మండల నాయకులు బాదావత్ జవహర్లాల్, పీఓ డబ్ల్యూ నాయకురాలు బానోత్ సుజాత వాంకుడోత్ సాలి , ,బాదావత్ కైలా కాంతి , ఐ ఎఫ్ టీయూ నాయకులు బానోత్ ధనవంతురావ్ , సర్దార్ ,శ్రీను, లోకియా, వాంకుడోత్ వెంకన్న పాల్గొన్నారు.