సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

by S Gopi |
సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: తెలంగాణలో అందవిస్వాసం రాజ్యమేలుతుందని, దీనిని తెలంగాణ ప్రజలు ఎక్కువరోజులు సహించరని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తోపాటు భద్రాచలం రోడ్‌, సత్తుపల్లి నూతన రైల్వే లైన్‌ను వర్చ్యువల్‌గా బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సామాజిక, ఆర్థిక అభివృద్దికి ఈ నూతన రైల్వే లైన్‌ దోహదపడుతుందన్నారు. భారీ పరిశ్రమలకు, బోగ్గు ఉత్పత్తి రంగ సంస్థలకు బొగ్గు రవాణా రైలు మార్గంతో సుగమమం అవుతుందని చెప్పారు. బోగ్గు రవాణా వ్యయం కూడా ఘననీయంగా తగ్గుతుందని, కాలుష్యం నివారించవచ్చని తద్వారా పర్యావరణ అనుకూల రవాణా విధానాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌, వరంగల్‌ ఇండస్ట్రీయల్‌ కారిడోర్‌, కాకతీయ మెగా టెక్స్‌స్టైల్‌ పార్‌ సారీ రహదారులను కలయికతో ఈ మార్గం సామార్థ్యాన్ని పెంచనున్నదని తెలిపారు. సింగరేణిని సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, హైదరాబాద్‌లో కూర్చుని కొందు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. సంస్థలో అధికశాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది అయినప్పుడు కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను హైదరాబాద్‌లోని కొందరు వ్యాపారస్తులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతూ కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థను అమ్మే ప్రసక్తి లేదని కొందరు తమ స్వార రాజకీయ ప్రయోజనాలకు యావత్తు తెలంగాణ సమాజాన్ని అసత్య ఆరోపణలతో తప్పుదారి పట్టిస్తున్నారని సింగరేణి కార్మికులు ఈ వదంతులు నమ్మవద్దని హితవు పలికారు.

తెలంగాణ ప్రజలు చైతన్య వంతులని ఈ దుష్ట పాలన ఎంతో కాలం నడవదని అన్నారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని, ఎన్ని కుయుక్తులు పన్నినా అది ఆపలేరని అందుకు మునుగోడు ఎన్నికలే నిదర్శనం అన్నారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతటిని తమ నియోజక వర్గానికి వచ్చేలా అక్కడి ప్రజలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలిరావడంతో హైదరాబాద్‌లో ఉన్న పాలకులకు నిద్ర పట్టదంటూ చమత్కరించారు. ఈ అభివృద్ది కార్యక్రమాలతో రైతులకు యావత్తు తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌవర్నర్‌ తమిళిసై సౌంధర్యరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజన్‌ పాల్గన్నారు.



Next Story

Most Viewed