సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కందాల శంకుస్థాపన

by Sridhar Babu |
సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కందాల శంకుస్థాపన
X

దిశ, కూసుమంచి : కిష్టాపురం, జుజ్జుల రావుపేట గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్నసీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం జుజ్జుల్ రావుపేట గ్రామంలో 8 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, కార్యదర్శి అసిఫ్ పాషా, జుజ్జులరావుపేట సర్పంచ్ మందడి పద్మారెడ్డి, కిష్టాపురం సర్పంచ్ పందిరి పద్మారెడ్డి, ఇంటూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed