కేసీఆర్‌తో కలిసి నూతన సచివాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర

by Dishanational1 |
కేసీఆర్‌తో కలిసి నూతన సచివాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి: నూతనంగా నిర్మాణ పనులు జరుగుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. నూతనంగా నిర్మించిన 'డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ' భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు ఫిబ్రవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపిన విషయం విధితమే.


Next Story

Most Viewed