కేసీఆర్ పిలుపు మేరకు దేశానికిి స్వాతంత్ర్యం వచ్చింది.. నోరు జారిన ఎమ్మెల్యే..

by Javid Pasha |   ( Updated:2024-06-29 15:37:45.0  )
కేసీఆర్ పిలుపు మేరకు దేశానికిి స్వాతంత్ర్యం వచ్చింది.. నోరు జారిన ఎమ్మెల్యే..
X

దిశ, కొత్తగూడెం: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా పాల్వంచలో శనివారం 75 అడుగుల జాతీయ జెండాతో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. అందులో కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పిలుపు మేరకు 75 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వచ్చింది భారతదేశానికి అని మాట తూలారు. స్వాతంత్ర్యం వజ్రోత్సవ వేడుకలను సైతం కేసీఆర్ భజన చేయడం పట్ల ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే వనమా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Click Here For Video Post..



Next Story

Most Viewed