- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట.. పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర

దిశ, సత్తుపల్లి: పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ జీవధ్వజ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, ఆలయ పెద్దలు పూర్ణకుంభంతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి భజన మందిర నిర్మాణానికి సహకారంగా ఎమ్మెల్యే రూ. 10 లక్షలు అందజేయడం పట్ల ఆలయ పెద్దలు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్టించుకోవడం గ్రామానికి శుభపరిణామని, ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించగా, కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడవి మల్లెల గ్రామ సర్పంచ్ మందపాటి అశోక్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, శేఖర్ బాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.