'ఎంపీల అభినందన సభను విజయవంతం చేయండి'

by Vinod kumar |
ఎంపీల అభినందన సభను విజయవంతం చేయండి
X

దిశ, సత్తుపల్లి: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యాక మొదటిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి విచ్చేయుచున్న ఎంపీలు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కు సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ జనసందోహం, మోటార్ సైకిల్ ర్యాలీతో ఘన స్వాగతం పలికి, సత్తుపల్లిలో నిర్వహించే అభినందన సభను విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంటకు తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని జీఎన్ఆర్ గార్డెన్స్ దగ్గర వారికి ఘన స్వాగతం పలకాలన్నారు. అనంతరం తల్లాడ రింగ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కల్లూరు మండల శివారు వద్ద ఘన స్వాగతం పలికి, కల్లూరు సెంటర్ వరకు రోడ్ షో, సభ జరుగుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు పెనుబల్లి మండల శివారు వద్ద ఘన స్వాగతం పలికి రోడ్ షో నిర్వహించి రింగ్ సెంటర్ వద్ద సభ, అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తో సత్తుపల్లి కి విచ్చేస్తారని తెలిపారు.


పట్టణంలో పాత సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి సాయంత్రం 4 గంటలకు అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ ప్రాంగణంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కళాకారుడు సాయిచంద్ తో ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఈనెల 19న రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి సాయిస్ఫూర్తి కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ, అనంతరం సత్తుపల్లి లోని పాత సెంటర్ ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వగ్రామమైన కందుకూరు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లె దవాఖానను ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

అభినందన సభను విజయవంతం చేయాలి..

సత్తుపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన అభినందన సభలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్సీ తాతా మధు కోరారు. అభినందన సభలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య కోరారు. అనంతరం సభ నిర్వహించే జేవీఆర్ కళాశాల ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్, సత్తుపల్లి డీసీసీబీ డైరెక్టర్ చల్లగుల్ల కృష్ణయ్య, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed