మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే రేగా శంకుస్థాపన

by Disha Web Desk 15 |
మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే రేగా శంకుస్థాపన
X

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పీజీ కొత్తూరు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ కు అనుబంధంగా ఆదివారం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో ఎత్తిపోతల పథకానికి 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మండలంలోని పలు గ్రామాలలో ఆయకట్టు సాగులో గల చెరువులు, కుంటలకు సాగునీరు అందనున్నది అని ఆయన తెలిపారు. మండలంలో మరో 17వేల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సుధీరెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, నెల్లిపాక రామచంద్రపురం, సీతారాంపురం, గొల్లగూడెం సర్పంచులతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయకట్టు రైతులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed