విద్యావ్యవస్థతోనే మార్పు సాధ్యం: రేగా కాంతారావు

by S Gopi |
విద్యావ్యవస్థతోనే మార్పు సాధ్యం: రేగా కాంతారావు
X

దిశ, మణుగూరు: ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజలతో మమేకం కావాలని...మనం మారాలి సమాజాన్ని మార్చాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. మణుగూరులో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా 4వ విద్యా వైజ్ఞానిక మహాసభలో మాట్లాడారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ విద్యావ్యవస్థపై దృష్టి పెట్టలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై దృష్టి సారించి మనఊరు-మనబడి ద్వారా అనేక నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ముందుకు రావాలని కోరారు. సమాజాన్ని మార్చే సత్తా మేధావి వర్గమైన ఉపాధ్యాయులకు ఉందన్నారు. త్వరలోనే రాష్ట్ర ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed