- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

దిశ, అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గిరిజన భవన్ లో బీసీకుల, చేతివృత్తుదారులకు రూ.లక్ష ఆర్థిక చేయూత చెక్కులను పంపిణీని సోమవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. కులవృత్తులు, చేతివృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పేదవాడు, సామాన్యుడు ఆర్థిక పరిపుష్టి సాదించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, పేదల కోసం ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుంది మన ప్రభుత్వమే అన్నారు. వారి అభివృద్ది పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి చిత్తశుద్ది ఉందని, అందుకే ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సోయం ప్రసాద్, సున్నం లలిత, జడ్పీటీసీలు పైడి వెంకటేశ్వర్లు భరత లావణ్య, చిన్నంశెట్టి వరలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.