ఖమ్మం సభకు తరలిరండి.. ఎమ్మెల్యే మెచ్చా

by Javid Pasha |
ఖమ్మం సభకు తరలిరండి.. ఎమ్మెల్యే మెచ్చా
X

దిశ, అశ్వారావుపేట: రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం నుంచి దాదాపు 7 వేలకు పైగా కార్యకర్తలు సభకు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. ఖమ్మం సభకు సీఎం కేసీఆర్ తో సహా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ హాజరవుతున్నారని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల్లోగా సభాస్థలికి చేరుకోవాలని ఎమ్మెల్యే కోరారు.



Next Story

Most Viewed