నేలకొండపల్లిలో ఎమ్మెల్యే కందాల పర్యటన

by Javid Pasha |
నేలకొండపల్లిలో ఎమ్మెల్యే కందాల పర్యటన
X

దిశ,నేలకొండపల్లి: ప్రజా సమస్యలే పరిష్కార ఎజెండాగా నేలకొండపల్లి మండల కేంద్రంలో పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి ఆదివారం ఉదయం పర్యటించారు. ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు నేలకొండపల్లి మేజర్ పంచాయితీ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. నేలకొండపల్లిలో చేపట్టిన రోడ్డు విస్తరణ, జంక్షన్లు, డివైడర్లు, పార్క్లు, వైకుంఠధామాలు,చేపల మార్కెట్ వంటి వాటిని గురించి తెలుసుకున్నారు. ఇటీవల బిఆర్ఎస్ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేటాయించిన 10కోట్ల రూపాయల అభివృద్ధికి సంబంధించి ప్రజాభిప్రాయం మేరకు ప్రణాళికలను సిద్దం చేయనున్నారు.

అలాగే ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన సమస్యలను అప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించనున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయా వార్డుల్లో ఉన్న సమిష్టి,వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య,సర్పంచ్ రాయపూడి నవీన్,ఎంపీడీఓ జమాల రెడ్డి,ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ రెడ్డి, అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed