- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా..ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

దిశ, కూసుమంచి : తన మీద నమ్మకంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు కృషి చేస్తా అన్నారు. కచ్చితంగా కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్ మన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పాలేరు నుంచి వేరేవాళ్ళు కూడా టిక్కెట్ ఆశించారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాములే అన్నారు. తనకు ఎవరి మీద అసంతృప్తి, బాధ గానీ లేదనీ తుమ్మల నాగేశ్వరరావు కూడా టిక్కెట్ ఆశించారు.
ఆయనతో కూడా కొంతమంది ఉన్నారు. వారందరినీ పార్టీ కోసం పనిచేయాలని, అందరినీ కలుపుకుని పోతానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్తారు. ఎలక్షన్ ల వరకే పార్టీలు, తరువాత ప్రజలంతా మనవాళ్లే అని ఈ సందర్బంగా గుర్తు చేశారు. నన్ను నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నరన్నారు. నాకు సాధ్యమైనంత వరకు అందరికీ మంచిచేయలనే కోరుకుంటానని, రానున్న ఎన్నికల్లో పాలేరు ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మంచి మనసుతో నన్ను దీవించాలన్నారు. ఎక్కడెక్కడ వారో వస్తారు. ఏవేవో మాట్లాడుతారు, అవన్నీ సాధారణమని, నిజంగా మీకోసం ఆలోచించే వారెవరో ఆలోచించి ఓటు వేయాలనీ, మీకు మరో ఐదేళ్లు మరింత మెరుగైన సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.