- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆందోళనను విరమించండి: సీపీఐ నాయకులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ సీఐని బదిలీ చేయాలంటూ సీపీఐ సోమవారం తలపెట్టిన ఆందోళనను విరమించాలని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సీపీఐ నాయకులకు ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సీపీఐ ప్రతిపాదించిన పలు సమస్యలకు సానుకూల పరిష్కారం త్వరలోనే చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ సీఐ సీపీఐ నాయకుల పట్ల, పార్టీ పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. అందుకు సంబంధించి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ, తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ప్రమాదకరంగా పరిణమించిన బీజేపీని నిలువరించేందుకు సీపీఐతో కలిసి పయనించాలని పార్టీ అధినేత కేసీఆర్ కూడా సూచించారని ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో సీపీఐ, టీఆర్ఎస్ మధ్య స్థానికంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏవీ ఉన్నానూ త్వరలోనే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావుతోపాటు సీపీఐ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో కూడా ప్రభుత్వం త్వరితగతిన తగు నిర్ణయం తీసుకుంటుందని ఉపేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు, భవిష్యత్తు రాజకీయ కర్తవ్యాలను దృష్టిలో ఉంచుకుని ఆందోళన విరమించాలని సీపీఐ నాయకులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.