- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందాళ

దిశ, కూసుమంచి: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పారిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ రాజకీయలను, పరిపాలనను మిళితం చేయకుండా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లేకుండా జూన్, జూలై లోపు 100% పూర్తి చేస్తామని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటె తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్,ఎంపిడివో కరుణాకర్ రెడ్డి, కల్లూరి గూడెం సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు,బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా,రామ సహాయం బాలకృష్ణ రెడ్డి, తిరుమలయ్య పాలెం ఎంపీపీ బోడ మంగీలాల్, రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణు, చావా వేణు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.