ఎలక్షన్ వన్ సైడే ... గెలుపు మనదే : ఎమ్మెల్యే కందాళ

by Mahesh |   ( Updated:2023-08-17 08:00:27.0  )
ఎలక్షన్ వన్ సైడే ... గెలుపు మనదే : ఎమ్మెల్యే కందాళ
X

దిశ, కూసుమంచి: మరో సారి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ వన్ సైడ్ ...గెలుపు మనదేనని అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బీసీ కుల వృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరో సారి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం నియోజకవర్గ స్థాయిలో బీ.సీ. కుల వృత్తులకు నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన 300 మందికి లక్ష రూపాయల చెక్కులను, అదేవిధంగా కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కందాళ స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ.. ఆర్థిక సహకారం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలు ఆర్థికంగా ఎదగాలని లక్ష రూపాయలు పథకం ప్రవేశపెట్టి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారన్నారు.

బీసీల అభివృద్దే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. ఈ ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ అని అర్హులైన ప్రతి బీసీ కుల వృత్తి దారుణుకి ఒక్కరికి దఫాలవారీగా ఈ ఆర్థిక సహాయం అందుతుందని, ఏ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఇవ్వలేదని ప్రజలు గమనించాలని అన్నారు. అప్లై చేయని వారికి మళ్లీ అప్లై చేసే అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట ఇచ్చిన హామీ తప్పకుండా చేస్తాం అనే విషయం ప్రజలకు తెలియజేయాలి, మండలం గ్రామ స్థాయి నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

లక్షల రూపాయలైనా కోటి రూపాయలైనా చెప్పింది చేస్తామనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కెసిఆర్‌ని ముఖ్యమంత్రిగా, రెండోసారి పాలేరు ఎమ్మెల్యేగా తనను గెలిపించి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బాణోత్ శ్రీనివాస్ నాయక్, బోడ మంగీలాల్, బెల్లం ఉమా, రమ్య, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరయ్య, మహమ్మద్ ఆసిఫ్ ఫాషా, వీరన్న, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ సహాయం బాలకృష్ణ రెడ్డి,మాజీ అధ్యక్షుడు చాట్ల పరశురామ్, వివిధ శాఖల అధికారులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed