- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

దిశ, ఇల్లందు : గ్రామపంచాయతీ కార్మికులకు 19 వేల జీతం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గత 13 రోజులుగా ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ధర్నా కార్యక్రమంలో భాగంగా 13వ రోజు జేఏసీ నిర్ణయం మేరకు ఎంపీడీవో కార్యాలయం నుండి ఎమ్మెల్యే కార్యాలయం వరకు గ్రామపంచాయతీ కార్మికులు వందలాదిగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి గ్రామపంచాయతీ కార్మికులకు 8500 జీతం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని కోరారు.
ధర్నాలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగం నన్ను తొలగించి కొత్త కార్మికులను తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. అనంతరం జేఏసీ నాయకులు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం పెంచారని తెలిపారు. కార్మికుల ఆందోళనను ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అబ్దుల్ నబీ, సారంగపాణి, యాకూబ్ శవాలి, రామ్ సింగ్, దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, తుపాకుల నాగేశ్వరరావు, తొగర సామేలు తదితరులు పాల్గొన్నారు.