జూనియ‌ర్ అసిస్టెంట్ ఫలితాల్లో గందరగోళం.. ఆందోళనలో అభ్యర్థులు

by Satheesh |   ( Updated:2022-09-11 15:01:28.0  )
జూనియ‌ర్ అసిస్టెంట్ ఫలితాల్లో గందరగోళం.. ఆందోళనలో అభ్యర్థులు
X

దిశ, కొత్తగూడెం: జూనియ‌ర్ అసిస్టెంట్ ఎక్స్‌టర్నల్ రాత ప‌రీక్ష ఫలితాలను సింగ‌రేణి సంస్థ శనివారం విడుదల చేసింది. అయితే ఈ జాబితా ఇప్పుడు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. 177 పోస్తులకు ఆగస్ట్ 4న రాత పరీక్ష నిర్వహించారు. అయితే, ఇవాళ విడుదల చేసిన ఫలితాలలో అభ్యర్థుల పేర్లకు బదులుగా రాష్ట్రాల పేర్లు, విద్యార్హతలను ముద్రించారు. దీంతో ఫలితాలపై అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగ‌రేణి సంస్థ నిర్వహించిన జూనియ‌ర్ అసిస్టెంట్ (ఎక్స్ టర్నల్) రాత ప‌రీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లోhttps://tssccl.onlineportal.org.in/SiteContent/frmobjlogin లో అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులు తమ పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్ర‌దేశ్, డిగ్రీ అంటూ దర్శనమివ్వడంతో అవాక్కవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ జాబితా నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందని నిరుద్యోగ యువతో పాటు కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అసలు ఈ రిజల్ట్స్ వాస్తవమా లేక ఫేకా అర్ధం కాక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఫలితాల జాబితా విడుదలలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వెల్ఫేర్ అండ్ రిక్రూట్మెంట్ శాఖా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Next Story