దేశానికే మిషన్ భగీరథ పథకం ఆదర్శం

by Sridhar Babu |
దేశానికే మిషన్ భగీరథ పథకం ఆదర్శం
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం ముర్కలి హిల్స్ మిషన్ భగీరథ మంచినీటి పథకం వద్ద తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తాగునీటి దినోత్సవంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ మంచినీటి పథకాన్ని వారు పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆనాటి పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతం వెనకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్లోరైడ్ తో తాగునీటి కోసం ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి మంచినీటి పథకం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రతి గ్రామానికి మిషన్ భగీర పథకం నుంచి మంచినీటి సరఫరా చేస్తున్నారని వివరించారు.

తన చిన్నతనంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉండేదని, బురద నీటిని సేవించానని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed