ఇంట్లోంచి రూ. 90 వేలు తీసుకుని పారిపోయిన బాలుడు... హైదరాబాద్‌లో ప్రత్యక్షం

by S Gopi |   ( Updated:2023-01-20 06:18:50.0  )
ఇంట్లోంచి రూ. 90 వేలు తీసుకుని పారిపోయిన బాలుడు... హైదరాబాద్‌లో ప్రత్యక్షం
X

దిశ, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నవభారత్ పబ్లిక్ స్కూల్ నందు ఎనిమిదో తరగతి చదువుతున్న ఎండీ అనాస్ గురువారం సాయంత్రం తన ఇంట్లో నుంచి 90 వేల రూపాయలు నగదు తీసుకుని సైకిల్ వేసుకుని వెళ్లిపోయాడని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు పాల్వంచ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్సై నరేష్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేయగా పిల్లవాడు హైదరాబాద్ బస్టాండ్ లో దొరికాడని, పిల్లవాడిని క్షేమంగా పాల్వంచకు తీసుకువచ్చి తన తల్లిదండ్రులకు అప్పగించడానికి తీసుకొస్తున్నామని తెలిపారు. ఫిర్యాదు అందిన 12 గంటల్లోపే పిల్లవాడి ఆచూకీ లభ్యం కావడంతో పిల్లవాడి తల్లిదండ్రులు, స్థానికులు ఎస్సై నరేష్ కు, బృందానికి అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed