'ముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికేట్లను తిరస్కరించడం సరికాదు'

by Hajipasha |
ముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికేట్లను తిరస్కరించడం సరికాదు
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేయకుండా దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కరకగూడెం మండల తహసీల్దార్ మహమ్మద్ వర్గానికి చెందిన ముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేయకుండా తిరస్కరిస్తున్నారని సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్వర్ణ లత‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా యాకూబ్ పాషా మాట్లాడుతూ.. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో విద్య, ఉపాధి మొదలైన వాటికి పలువురు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్, సర్వర్ తన వెంట పాల్గొన్నారు.



Next Story

Most Viewed