- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం : మంత్రి పువ్వాడ

దిశ, రఘునాథపాలెం: సామాన్యుడికి ఆధునాతనమైన, మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైద్యరంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, పేదలు, సామాన్యులకు చెంతనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి సామాన్యుడి చెంతకు చేర్చారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరిజ్ఞాన యంత్రాలతో కార్పొరేట్ స్థాయికి మించి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఆసుపత్రులను ఆధునీకరించిందన్నారు. గ్రామంలోని క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇదే తరహాలో వైద్యాన్ని అందించాలని ధృడ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని కోరారు. వానాకాలం వచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విష జ్వరాలు ప్రబలకుండా గ్రామ పంచాయతి ఎప్పటికపుడు బ్లీచింగ్ చెస్తు, మురుగు నిల్వ ఉండకుండ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
హెల్త్ సెంటర్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని, హెల్త్ సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని అరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్, జిల్లా కలెక్టర్ వీపీగౌతం, జిల్లా వైద్యధికారి మాలతీ గారు, డీపీఓ హరిప్రసాద్ గారు, డీఆర్డీఓ విద్యచందన గారు, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఈ ఈ ఉమా మహేశ్వర రావు, కార్పొరేటర్లు మేడారపు వేంకటేశ్వర్లు గారు, ఎండివో రామక్రిష్ణ గారు, తహసీల్దార్ నరసింహారావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, సర్పంచ్ గుడిపూడి శారదా తదితరులు పాల్గొన్నారు.