- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మంత్రి అజయ్ సహకారం మరువలేనిది : ఎమ్మెల్యే హరిప్రియ

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మంజిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారం మరువలేనిదని ఇల్లందు నియోజక వర్గశాసన సభ్యురాలు హరిప్రియ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామంలో శ్రీ కోటమైసమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ పున:నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా తగు శాఖపరమైన అనుమతులు ఇప్పించాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మంత్రి అజయ్ ని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి ఆలయ పున:నిర్మాణానికి కావాల్సిన అనుమతులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.