'గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి'

by S Gopi |
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
X

దిశ, ఇల్లందు: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తొడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదివారం టెకులపల్లి మండలం బోడు గ్రామంలో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రథమ మహసభలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎనిమిది గంటల పనిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ నలబై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా కుదించి కార్మీకుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జటంగి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు తొగరసామేలు, సహయ కార్యదర్శి రామిశెట్టి నర్సింహారావు మహసభకు అధ్యక్షత వహించారు. అమరవీరులను శ్మరిస్తూ ప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. మహసభ ప్రారంభానికి ముందుగా ఐఎఫీటీయూ జెండాను జిల్లా అధ్యక్షులు తొడేటి నాగేశ్వరరావు అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ జిల్లా నాయకులు ఎట్టి నర్సింహారావు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు నరాటి వెంకటేశ్వర్లు, యాసారపు వెంకన్న, రాయిల్ల కొటి లింగం, మేకల వినొదకూమార్, కల్తీ శంకర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎలక రాధాకృష్ణ, సరికొండ నాగేశ్వరరావు, చింతల నర్సయ్య, చింతల బాగ్యమ్మ, తాండ్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed