- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాలల సంరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి: ఎస్పీ వినీత్

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఆపరేషన్ స్మైల్ IXలో భాగంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీసు బృందాలతో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ డా. వినీత్ జి ఏర్పాటు చేశారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ కు తరలించడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను, వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ కు తరలించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, ఇతర కారణాల వల్ల అణచివేతకు గురవుతున్న బాలలను రెస్క్యూ చేసేందుకు కావాల్సిన సిబ్బందిని వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేసారు. ముఖ్యంగా ఈ సమావేశంలో చిన్నారులను ఎలా రక్షించాలనే అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ నందీరామ్, షీ టీం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లేనీనా స్వర్ణలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ అంబేద్కర్, సాదిక్ పాషా, సుమిత్రా దేవి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హరి కుమారి, లీగల్ ఆఫీసర్ శివ కుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.