సొంత గూటికి చేరిన మట్టా దంపతులు

by Dishaweb |
సొంత గూటికి చేరిన మట్టా దంపతులు
X

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, డాక్టర్ రాగ మయి దంపతులు, మాజీ పార్లమెంటు సభ్యురాలు ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ శ్రీమతి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్లో గురువారం ఉదయం12. గంటలకు నియోజకవర్గం లో సుమారు 500 మంది ముఖ్య నాయకులు కార్యకర్తలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్య రావు యఠా ఠాక్రే , తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా సత్తుపల్లి నియోజకవర్గం లో ఉన్న డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచేందుకు విముక్తి తో చూపి టిఆర్ఎస్ పార్టీలోనే ఇప్పటివరకు కొనసాగిన మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి నియోజకవర్గ రాజకీయాలు శరవేగంగా మారుతుండటంతో రాజకీయ పరిణామాలు నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పటికీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ విభేదించి టిఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పించడంలో విఫలమైందున బీఆర్ఎస్ పార్టీని వీడి తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతానని శ్రీమతి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.

గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీలో జరిగిన అవమానాలు, అవహేళన గురించి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు, సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజల అదృష్టం మేరకు ప్రజా ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సత్తుపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజాఆభీష్ట మేరకే కాంగ్రెస్ పార్టీలో సుమారు 500 మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు, తో పాటు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు ఆయన తెలియజేశారు, తద్వారా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చే కోరుతుందని వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నున్నా రామకృష్ణ, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాసరావు, ఎండి కమల్ భాష, నల్లగట్ల పుల్లయ్య, బత్తుల భరత్, పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలతో గాంధీభవన్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.



Next Story