- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

దిశ, భద్రాచలం : మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్పెషల్ పార్టీ సిబ్బంది, 141 బెటాలియన్, 81 బెటాలియన్, సీఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చర్ల మండలంలోని తిప్పాపురం అటవీ ప్రాంతంలో నిర్వహించిన కూబింగ్ ఆపరేషన్ లో చత్తీస్ఘడ్ రాష్ట్రం పామేడు రాసపల్లి మరియు కంచాల గ్రామాలకు చెందిన ఎనిమిది
మంది నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు, కమిటీ సభ్యులను అరెస్టు చేసినట్లుగా ఏ ఎస్ పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అరెస్ట్ అయినా మిలీషియా కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించారు. మడకం బద్రు, మడకం జోగా, మడివి సన్న, మడివి భీమ, మడివి అంద, మడివి బీమా, కల్మ దూల, గంగ గా తెలిపారు. అరెస్టు అయిన పై 8 మంది గత రెండు సంవత్సరాలుగా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో కమిటీలోని కంచాల రాసపల్లి ఆర్ సీపీ మిలీషియా కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారని తెలిపారు.