మావోయిస్టుల లేఖ కలకలం

by S Gopi |   ( Updated:2022-12-04 08:45:00.0  )
మావోయిస్టుల లేఖ కలకలం
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కోరేగడ్డ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కోరెగడ్డ ప్రాంత ప్రజలు తమకు న్యాయం జరిగే వరకూ సీతమ్మ సాగర్ కరకట్ట పనులు అడ్డుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. నిర్వాసితుల సమస్యను పరిష్కారం చేసే వరకు పోరాడాలని పిలుపునిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

'ప్రజలనుంచి ఎలాంటి డిమాండ్ లేని కొత్త కొత్త ప్రాజెక్టుల ఆంతర్యం వెనుక దోపిడీ తప్ప ప్రజలకు ప్రయోజనం శూన్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అనేక భారీ ప్రాజెక్టులు ఆనకట్టలు నిర్మిస్తుంది. సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల ప్రయోజనాలు, కేసీఆర్ కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం వద్ద మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 10 గ్రామా పంచాయితీలకు సంబంధించి 2100 కుటుంబాలకు చెందిన 8500 జనాభా. 2,700 ఎకరాల పంట భూములు రైతులు కోల్పోయి నిర్వాసితులుగా, కూలీలుగా మారే పరిస్థితి ఎదురవుతుంది. ఈ ప్రాంతాల్లో కూలీలుగా, పాలేరులుగా వెట్టి చాకిరి చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతర దళితులు సాగుచేసుకునే భూములకు ఎలాంటి హక్కులు లేకుండా చేసిన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఇదే ప్రాంతంలో ఉన్న పెత్తందారులు, భూస్వాములకు మాత్రం భూమిపై హక్కు కల్పించింది. లంక భూములను నమ్ముకుని ఇప్పటివరకు జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. గోదావరి మధ్య ప్రాంతాల్లో అనేక ఎకరాలు లంక భూములను సాగుచేస్తూ తమ జీవన ఆధారంగా జీవిస్తున్న ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతమైన లింగాల, గొమ్ముగూడెం, గాంధీనగర్, ఉమ్మదారం. తేగడ, కలివేరు, దండుపేట, లింగాపురం, గుంపల్లి, కొత్తూరు, ఆనంద్ కాలనీ, కళంగుంపు, మొగళ్ళపల్లి, జిపిపల్లి, వీరాపురం, శిఖర్తిగూడెం, చీమలపాడు, కొయ్యూరు, వర్గ, విజయపురి కాలనీ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలు తమ తమ పిల్లాపాపలతో లంక భూముల్లో పంటలసాగు చేసుకుంటున్నారు. ఇలాంటి భూములకు ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవ్వకుండా వాటిని సాగుచేసుకుంటున్న కుంటుంబాలను ప్రభుత్వం రోడ్డున పడేసేవిధంగా చూస్తుంది. దీన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తక్షణమే ఈ భూములను సర్వే చేపించి ఇక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. సీతమ్మ సాగర ప్రాజెక్టుతో ఆ రైతుల బతుకులు బజారు పాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కోరిగడ్డ ప్రజలు నిర్వాసిత రైతాంగం సంఘంగా సంఘటితమై ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసినప్పుడే వారి సమస్యకు పరిస్కారం దొరుకుతుంది. కోరిగడ్డ ప్రాంత ప్రజలను నిర్వాసితులుగా గుర్తించి వారి భూమి ప్రభుత్వం సర్వే చేపించి నష్ట సరిహారం చెల్లించి ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కోరేగడ్డ ప్రజలారా మీకు మద్దతుగా నిలబడని రాజకీయ పార్టీలు, నాయకులు ఉంటే వారిని తరిమికొట్టాలని పిలుపునిస్తున్నాం' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed