భద్రాచలం అర్డీఓ గా మంగీలాల్

by Sridhar Babu |
భద్రాచలం అర్డీఓ గా మంగీలాల్
X

దిశ, భద్రాచలం : భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారిగా మాలోత్ మంగీలాల్ బాధ్యతలు స్వీకరించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎస్డీసీ గా విధులు నిర్వహిస్తూ ఆర్డీవో గా పదోన్నతిపై వచ్చి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భద్రాచలంలోని 41 పోలింగ్ స్టేషన్ లు ఆయన పరిశీలించి త్వరలో ఎన్నికలు వస్తున్నందున వికలాంగులకు, వృద్ధులకు ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని ముఖ్యంగా వికలాంగుల కొరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కరెంటు, మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ రమేష్ , సంబంధిత తహసీల్దార్​లు తదితరులు పాల్గొన్నారు.



Next Story