రాజయ్య నగర్‌‌‌లో గిరిజనుడు దారుణ హత్య

by S Gopi |
రాజయ్య నగర్‌‌‌లో గిరిజనుడు దారుణ హత్య
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట గ్రామపంచాయతీ రాజనగర్ గ్రామంలో గిరిజనుడి హత్య జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జేగురుకొండ (పెద్దగొల్లూరు)కు చెందిన సప్కా రమేష్ (గంగయ్య) సుమారు రెండు దశాబ్దాల క్రితం ఈ గ్రామానికి వసల వచ్చాడు. ఇక్కడి నుంచి మూడేళ్ళ క్రితం ములుగు జిల్లాకి మకాం మార్చి ఇక్కడకు అడపాదడపా వచ్చి వెళుతున్నాడు. రమేష్‌‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి ఇద్దరు సంతానం. చిన్న భార్య ప్రస్తుతం ఆరునెలల గర్భిణి. చిన్నభార్య లక్ష్మి ఇంటిలో నిద్రించగా, పెద్ద భార్యతో రమేష్ ఆరుబయట నిద్రించాడు.


గురువారం అర్థరాత్రి సమయంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి నిద్రపోతున్న సప్కా రమేష్‌ని లేపి కర్రలతో కొట్టి కత్తులతో పొడిచి హత్య చేశారు. అడ్డుపడిన పెద్ద భార్యపై కూడా దాడి చేశారు. వచ్చినవారు నల్లరంగు దుస్తులు, ముసుగులు వేసుకున్నట్లు సంఘటన ప్రత్యక్ష సాక్షి పెద్దభార్య దేవి తెలిపింది. 2018లో ఇదే గ్రామంలో జరిగిన మడివి రమేష్ హత్య కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇపుడు ఈ హత్య పలురకాల అనుమానాలను కలిగిస్తోంది. రమేష్ హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో జరిగిన ఈ హత్య అందరిని ఉలిక్కిపాటుకి గురిచేసింది. దీనిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed