ఫోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష

by Sridhar Babu |
ఫోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష
X

దిశ, దమ్మపేట : ఫోక్సో కేసులో వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ , ఫోక్సో స్పెషల్ జడ్జి శ్యామల శ్రీ శుక్రవారం తీర్పు వెలువరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామంలో 2019 సంవత్సరం జనవరి 3 తేదీన ఓ వివాహిత తన పెద్ద కూతుర్ని బియ్యం కోసం కొలిక పోగు లక్ష్మీ అనే మహిళ ఇంటికి పంపించగా ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి బాలిక తల్లి లక్ష్మీ ఇంటికి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి.

తలుపు కొట్టి పిలవగా లక్ష్మీ భర్త కొలికిపోగు ప్రసాద్ తలుపులు తీశాడు. దీంతో ఇంట్లో ఉన్న బాలిక తల్లి మాటవిని ఏడుస్తూ బయటికి వచ్చింది. బాలికపై ప్రసాద్ అత్యాచారం చేశాడని జరిగిన విషయాన్ని బాలిక తండ్రికి చెప్పి తల్లి దమ్మపేట పోలీసులకు తెలియజేసింది. దీంతో అప్పటి ఏఎస్ఐ షేక్ సర్దార్ కేసు నమోదు చేశారు. అప్పటి పాల్వంచ డీఎస్పీ మధుసూదన్ రావు కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పదిమంది సాక్షుల విచారణ అనంతరం కొలికి పోగు ప్రసాద్​కు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 20వేల రూపాయలు జరిమానా విధించారు. మైనర్ బాలికకు ఐదు లక్షల నష్టపరిహారంను ప్రసాద్ చెల్లించాలని తీర్పు వెలువరించారు.



Next Story