సాగర్​ కాలువలో పడి వ్యక్తి గల్లంతు

by Disha Web Desk 15 |
సాగర్​ కాలువలో పడి వ్యక్తి గల్లంతు
X

దిశ, ఖమ్మం రూరల్​ : సాగర్​ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన రూరల్​ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. రూరల్​ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన నాను అనే వ్యక్తి శుక్రవారం అనారోగ్యంతో మరణించడంతో ఖర్మకాండల కోసమని శనివారం భూక్యా మంగ్య (45) సమీప బంధువులతో కలిసి సాగర్​ కాలువలో స్నానం చేయడం కోసం వెళ్లడంతో ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో గల్లంతయ్యాడు. కళ్లముందు గల్లంతవుతున్న మంగ్యను రక్షించేందుకు ప్రయత్నం చేసినా సాగర్​ నీటి ప్రవాహాం అధికంగా ఉండడంతో ప్రయత్నం ఫలించలేదు. దాంతో మంగ్య నీటిలో కొట్టుకుపోయాడు.


Next Story

Most Viewed