బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి

by Shiva |
బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి
X

దిశ, శామీర్ పేట: కుక్క అడ్డురావడంతో బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరన్నగారి లక్ష్మణ్ (55) మండల పరిధిలోని బొమ్మరాసిపేటలో తన కూతురు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ఉద్దేమర్రిలోని తన బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వాహనానికి ఎదురుగా కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి మహిళను ఢీకొట్టాడు. దీంతో లక్ష్మణ్ తో పాటు రోడ్డు దాటతున్న మహిళకు తెలికపాటి గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను ఒంటిమామిడి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మణ్ చికత్స పొందుతూ మృతి చందాడు. చిన్న గాయాలతో చికిత్స పొందుతూ సురక్షితంగా ఉంది. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story