- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘోర రోడ్డు ప్రమాదం... కోన ఊపిరితో ఉన్న రాము మృతి
by S Gopi |

X
దిశ, తిరుమలాయపాలెం: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన జాల రాము(35) లారీ డ్రైవర్, ఎస్.కె. అన్వర్ పాషా(21) లారీ క్లినర్. ఈ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై సమీప గ్రామమైన కేశవాపురం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోగా పక్కనే ఉన్న బండరాయిపై పడగా రాము, అన్వర్ పాషాల తలలకు బలమైన గాయాలు అయ్యాయి. కోన ఊపిరితో ఉన్న రామును చూపరులు గుర్తించి 108 ద్వారా తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందగా, అన్వర్ పాషా చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
Next Story