అనారోగ్యం వేధించడంతో వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
అనారోగ్యం వేధించడంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, టేకులపల్లి : అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపం చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. టేకులపల్లి ఎస్సై గన్ రెడ్డి రమణారెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గారే రామస్వామి (62) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామస్వామికి షుగర్ వ్యాధి కారణంగా ఒక కాలు తొలగించారు.

అలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం మంచిగా లేదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కొత్తగూడెం హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కోడలు ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. మృతుడికి భార్య విజయ కుమారి, కుమారుడు పృథ్వి ఉన్నారు.



Next Story