- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణలో అంతర్గత రోడ్లకు మహర్దశ : ఎమ్మెల్యే మెచ్చా

దిశ, అశ్వారావుపేట : అంతర్గత రోడ్ల నిర్మాణంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో రూ. 82 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో దిశ అశ్వారావుపేట విలేఖరి దిలీప్ ఖన్నా పెద్ద కూతురు జయకీర్తి 6వ పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం లక్ష్మీనారాయణ మొబైల్ షాప్ వద్ద సేవలను ఎమ్మెల్యే మెచ్చా ప్రారంభించారు.
మొద్దులగూడెంలో విద్యుత్ లైన్.. డ్రైనేజీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో సంబంధిత అధికారులను త్వరగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. నారంవారిగూడెం -గుర్రాల చెరువు వరకు కోటి 85 లక్షల వ్యయంతో జరుగుతున్న 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలంటూ సూచించారు. గుర్రాల చెరువులో వృద్ధుడి అభ్యర్థన మేరకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సిఫార్సు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలలో ప్రజల కోరిన సమస్యలు పరిష్కారం దిశగా ఎమ్మెల్యే పర్యటన సాగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.