రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
X

దిశ,కల్లూరు : స్థానిక మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ సమీపాన ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్సై కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం ధాన్యం లోడుతో మహబూబాబాద్ జిల్లా కే సముద్రం నుండి కృష్ణాజిల్లా విసన్నపేట గ్రామానికి వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీ కొట్టిన డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ఖమ్మం అర్బన్ కోటపాడు గ్రామానికి చెందిన ఎస్ కే జాన్ పాషా (31) గా గుర్తించారు. ముందు వెళ్తున్న లారీకి అకస్మాత్తుగా గేదెలు అడ్డురావడంతో సడన్​ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న జాన్ పాషా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ హనుక్, ఎస్సై కొండలరావు లారీ క్యాబిన్ నుంచి మృతదేహాన్ని స్వయంగా బయటకు తీశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Next Story

Most Viewed