- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాధితులను వేధిస్తున్న లోన్ రికవరీ గాళ్లు.. పోలీసులమంటూ వార్నింగ్

దిశ, ఖమ్మం: లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవసరాలకు లోన్ తీసుకున్న బాధితలకు ఫోన్లు చేసి మరీ వేధిస్తున్న సంఘటనలు ఖమ్మంలో వెలుగుచూస్తున్నాయి. లోన్లు తీసుకొని బకాయిలు ప్రతినెల చెల్లించినా ఓడీ చార్జిలంటూ బాధితులకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి బజాజ్ రికవరీ ఏజెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి సిఐగా మాట్లాడుతున్నా అంటూ హుకుం జారీ చేశాడు.
లోన్ కట్టకపోతే రిమాండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఖమ్మం నగరంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుశీల అనే ఉద్యోగి రేవతి సెంటర్లో ఉంటుంది. అయితే ఆమె బజాజ్ లోన్ తీసుకుంది. ప్రతి నెల లోన్ కట్టినప్పటికీ ఓడీ చార్జీలు ఉన్నాయంటూ సుశీల కొడుకు అయిన నాగరాజుకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం నాగరాజుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి పోలీస్ కమిషనర్ ఆఫీసు నుంచి సిఐ మాట్లాడుతున్నానంటూ బెదిరింపులకు గురి చేశాడు.
'లోన్ రికవరీ లాయర్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, లాయర్ కమిషనర్ ఆఫీస్లో నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నిన్ను ఒక 30 నిమిషాల్లో ఎస్సై వచ్చి అరెస్ట్ చేస్తారు' అని అల్టిమేటం జారీ చేశాడు. దాంతో నాగరాజుకు ఏం చేయాలో అర్థం కాక అరగంట టైం ఇవ్వండి సార్ నేను కడతా అని వేడుకున్నాడు. అనంతరం డబ్బులు కట్టకపోతే మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించాడు.
గతంలో లోన్ రికవరీ ఏజెంట్ల బెదిరింపులతో చాలామంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ లోన్ రికవరీ ఏజెంట్లు తమ తీరు మార్చుకొకుండా, ఇంకా పోలీసులమంటూ నేరుగా బాధ్యులను బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.