మంచి అలవాట్లతో ఆయురారోగ్యాలతో జీవించాలి

by Shiva |
మంచి అలవాట్లతో ఆయురారోగ్యాలతో జీవించాలి
X

జిల్లా జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు

దిశ, లీగల్ ఖమ్మం: విద్యార్థులందరూ మంచి అలవాట్లను నేర్చుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు ఆకాక్షించారు. ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సీ.వీ.రామన్ జూనియర్ కళాశాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ గా బతకాలనే సామెతను ఉటంకించిన న్యాయమూర్తి విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు చదువులు తప్ప వేరే ఆలోచనలు పెట్టుకోవద్దని హితవు పలికారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలలకు స్నేహపూర్వక న్యాయ సేవలు అందించేందుకు న్యాయ సేవా సంస్థలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇతరులకు ఉన్న గొప్ప సౌకర్యాలను చూసి తమతో పోల్చుకోవద్దని, తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడానికి కృషి చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ బాల్యవివాహాలు అనే దురాచారాలు సమాజంలో బాలల హక్కులను హరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొగతాగడం, గుట్కాలు, తంబాకు తినడం లాంటి దొరలవాట్లకు బానిసలు కావొద్దని అవి ఆరోగ్యాన్ని హరించేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి విద్యార్థులకు వివిధ చట్టాలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, సీనియర్ న్యాయవాదులు ఏడునూతల శ్రీనివాసరావు, ఇమ్మడి లక్ష్మీనారాయణ, కళాశాల డైరెక్టర్ ఆళ్ల పావని రవికుమార్, కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed