- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
"టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకే కవితమ్మ పై లిక్కర్ స్కాం"

దిశ, ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో విశ్వాసం కోల్పోయే విధంగా బీజేపీ కుట్రలు పండుతుందని, వేస్తున్న కుట్రలను తిప్పి కొట్టి తెలంగాణ వాదులకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే దురుద్దేశంతోనే లిక్కర్ స్కాం పేరుతో కవితమ్మ కు నోటీసులు.. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేని బిజెపి పార్టీ నాయకులు గుంట నక్క రాజకీయాలకు తెరలేపారు. చైతన్యవంతమైన తెలంగాణ బిడ్డలను బిజెపి కుటిల రాజకీయాలతో తప్పుదోవ పట్టించలేరు. చైతన్యవంతమైన తెలంగాణ బిడ్డలు బిజెపి పార్టీ నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయం. షర్మిల బీజెపి పార్టీ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు.
షర్మిల ఎన్ని మాటలు మాట్లాడిన తెలంగాణ ప్రజలు స్వాగతించరు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో షర్మిలనే ఒప్పుకుంది నిజం కాదా.. తెలంగాణ విభజన సమయంలోనే షర్మిల నిజస్వరూపం ఏమిటి అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇంకా మీ మాటలతో మోసపోతాం అనుకోవడం మీ పొరపాటే.. సుభిక్షమైన పాలన జరుగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లాగా ఉంది అంటూ హేళన చేయడం తో మీ అక్కసు ఏమిటో అర్థం అయింది.
టీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి నిర్ణయానికైనా కట్టుబడి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాం.. తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మత విద్వేష బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో వామపక్ష సోదరులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను హేళన చేయడం సరికాదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఉద్యోగులను గౌరవిస్తూ హుందాతనం చాటాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వాదులు అందరూ కలిసి పని చేయాలి అని కోరారు. టిఆర్ఎస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పిటిసి వరప్రసాద్ , సిసిపి డైరెక్ట్ ఇంటూరి శేఖర్, వైస్ ఎంపీపీ దర్గయ్య, రైతు కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న , తిరుమలాయపాలెం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, చామకూరి రాజు, మరియు ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.