సింగరేణి అభివృద్ధికి కృషి చేద్దాం

by Shiva |
సింగరేణి అభివృద్ధికి కృషి చేద్దాం
X

ఏరియా జీఎం డీ.రాంచందర్

దిశ, మణుగూరు: అందరూ కలిసి సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలని మణుగూరు ఏరియా జీఎం.డీ.రాంచందర్ అన్నారు. మణుగూరు ఏరియా నుంచి సింగరేణి డైరెక్టర్ గా పదోన్నతిపై వెళ్లిన జి.వెంకటేశ్వర రెడ్డి స్థానంలో ఏరియా జీఎంగా రాంచందర్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు రవాణా, ఉత్పత్తిలోమణుగూరు ఏరియాకు ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. రక్షణతో కూడిన సింగరేణి అభివృద్ధికి కృషి చేద్దామని, వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.



Next Story

Most Viewed