- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పినపాకలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. కేటీఆర్ సమక్షంలో చేరికలు..

దిశ, మణుగూరు: పినపాకలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పినపాక నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, పినపాక మండలాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ ప్రగతి భవన్లో ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, మదర్ సాహెబ్, సోమరాజు, కుడితిపూడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య, గోగ్గలి నరసయ్య, సుబ్బారావు, నిమ్మ లింగా రెడ్డి పార్టీ మారిన వారిలో ఉన్నారు. అనంతరం రేగా కాంతారావు గారు మాట్లాడుతూ.. రాష్ట్రానికి దేశానికి ఎప్పటికైనా సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సహకారమవు అవుతుందని తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఐటీ పరిశ్రమలు మున్సిపాలిటీ తదితర శాఖలలో సరికొత్త సంస్కరణలతో పాటు.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. నేడు అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ను రోల్ మోడల్గా నిలిపే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని దేశ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తును 12,000 కోట్లతో ఉచితంగా అందిస్తున్నారని అన్నారు.