దళితుల భూములు లాక్కోవడం అన్యాయం

by Sridhar Babu |
దళితుల భూములు లాక్కోవడం అన్యాయం
X

దిశ, కూసుమంచి : కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో హరితహారం నర్సరీ పేరుతో ప్రభుత్వం దళితుల భూములు లాక్కుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయం కొరకు కూసుమంచి తహసీల్దార్ శకుంతలకు బీఎస్పీ నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజుపేట గ్రామంలో గడీల దొరల చేతుల్లో ప్రభుత్వ భూమి వందల ఎకరాలు ఉన్నదని, దీన్ని బయటికి తీసి దళితులకు 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

పెత్తందార్ల దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని వదిలి పేద దళితుల భూములు గుంజుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాజుపేట గ్రామం లో ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి పంచారు ? ఎంతమంది దళితులకు దళిత బంధు స్కీమ్ ఇచ్చారు ? ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బి.ఉపేందర్, జిల్లా మహిళా కన్వీనర్ మంజుల, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టే నాగేశ్వర్ రావు, పాలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ , సీనియర్ నాయకులు కొమ్ము ఫూలే, మండల అధ్యక్షుడు సాయి చరణ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed