ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. ఉపాధ్యాయురాలిపై కేసు..

by Javid Pasha |   ( Updated:2022-05-12 18:34:32.0  )
ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. ఉపాధ్యాయురాలిపై కేసు..
X

దిశ, దమ్మపేట: సింగరేణిలో బదిలీ వర్కర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన మహిళపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సుబ్బన్న పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు యాసం రాజేశ్వరి కొద్ది రోజుల క్రితం సింగరేణిలో బదిలీ వర్కర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కొందరు యువకులను నమ్మించింది.

తన స్కీంలో భాగంగా పలు గ్రామాలకు చెందిన నలుగురు యువకులు కారం నరసింహారావు, కట్టం విష్ణు, కూరం జయంత్, దడి చంటిల దగ్గర 8లక్షలు తీసుకుంది. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోయామని తెలుసుకున్న యువకుడు కురం నరసింహారావు గురువారం దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్సై శ్రావణ్ కుమార్ యసం రాజేశ్వరిపై కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed