కుంజా సీతమ్మ మృతదేహం లభ్యం

by Sridhar Babu |
కుంజా సీతమ్మ మృతదేహం లభ్యం
X

దిశ,ములకలపల్లి : గత బుధవారం వరద నీటిలో గల్లంతైన కుంజా సీతమ్మ (48) మృతదేహం శుక్రవారం దొరికింది. వరద ఉధృతి ఎక్కువ గా ఉండటంతో మామిళ్లగూడెం ప్రాంతం లో పాములేరు వాగులో చెట్ల పొదల్లో చిక్కుకుపోయి ఉంది. సీతమ్మ కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు నరాటి ప్రసాద్ పరామర్శించారు. మృత దేహం ఉన్న ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed