KTR: మరోసారి కేటీఆర్ టూర్ వాయిదా

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-15 06:38:09.0  )
KTR: మరోసారి కేటీఆర్ టూర్ వాయిదా
X

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మంలో కేటీఆర్ టూర్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16న జరగాల్సిన ప్రారంభోత్సవాలు ఈ నెల 18కి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం నగరంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరుపనున్న క్రమంలో ఇప్పటికే జిల్లా,నగర నాయకులు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ టూర్ వాయిదా కావడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ సారైనా 18న కేటీఆర్ టూర్ ఉంటుందా? లేదా? అనేది చూడాలి.

కేటీఆర్ పర్యటన వివరాలు

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్‌ ఈ నెల 18న ఉదయం 9న హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా బయలుదేరి 10 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 10:15కు రఘునాథపాలెం బృహత్‌ పల్లె ప్రకృతి వనం (సుడా) పార్కును ప్రారంభిస్తారు. 10:45కు ఖమ్మం టేకులపల్లి కేసీఆర్‌ టవర్స్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయంలో 240 ఇళ్లను ప్రారంభిస్తారు. 11:15కు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్‌పాత్‌ను ప్రారంభిస్తారు. 11:45కు గట్టయ్య సెంటర్‌లోని నూతన మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ కోసం మంజూరైన 10 ట్రాక్టర్లు, 15 ఆటోలను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం తీసుకుంటారు. 2:30కు దానవాయిగూడెంలో ఎఫ్‌ఎస్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. 3 గంటలకు ప్రకాశ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత 3:30కు శ్రీనివాసనగర్‌లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరిగా సాయంత్రం 4 గంటలకు లకారం ట్యాంక్‌బండ్‌లో సస్పెన్షన్‌ బ్రిడ్జి, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌లను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. కాగా ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికే పిలుపునిచ్చారు.



Next Story