- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతుని రాజు చేయటమే కేసీఆర్ లక్ష్యం : ఎంపీ నామా

దిశ, చండ్రుగొండ : కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అంబానీ, అదానీల ఆదాయం మాత్రమే పెంచుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం రైతుల ఆదాయాన్ని పెంచుతున్నారని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు తెలిపారు. సంపద పెంచి రైతుబంధు, కేసీఆర్ కిట్, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్తో పేదలకు పంచుతుంటే, బీజేపీ వారు పేదల దగ్గర పన్నుల పేరుతో గుంజుకుని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. నగదు రహిత సేవలు అని ప్రారంభించి ఇప్పుడు గూగుల్ పే, పేటీఎంలు వినియోగించిన వారికి త్వరలో 1.1 శాతం పన్ను విధించనున్నారని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రం లక్ష్య గార్డెన్ లో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ..పంటలకు అవసరమైన విద్యుత్, టైమ్కు ఎరువులు, పంట పెట్టుబడికి రూ.10వేలు, కాళేశ్వరం నీరు సీఎం కేసీఆర్ తెచ్చినందునే నేడు రాష్ట్రంలో రైతులు బాగున్నారని తెలిపారు. అదేవిధంగా సీతారాం ప్రాజెక్ట్ కాలువ తో రైతుల భూములు బంగారంతో సమానంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ సమాధులు తవ్వే పనిలో ఉంటే సమైక్యతతో బలమైన పునాదులు తవ్వే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే బాధ్యత మన అందరిది
బీఆర్ఎస్ కన్నతల్లిలాంటిదని, దానిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే మాట్లాడుకోవాలని, కేసీఆర్ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరచడానికి పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే గృహ లక్ష్మి కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రతి పేదవారికి తప్పకుండా ఇళ్లు ఇస్తామని హామినిచ్చారు.
దేశవ్యాప్తంగా యాసంగిలో 97లక్షలు వరి సాగైతే తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందన్నారు. సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ధారా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, గ్రామ శాఖ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడం మోహన్ రావు, గాదే శివప్రసాద్ , భూపతి రమేష్, మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ మియా, గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.