- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కిక్కు లక్కు ఎవరికో

దిశ, ఖమ్మం : లక్కు కిక్కు ఎవరిని వరిస్తుందోనని మద్యం టెండర్దారులు టెన్షన్లో ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టి టెండర్లు దాఖలు చేసిన వ్యాపారులు డ్రాలో తమ పేరు వస్తుందా, లేదా అనే ఆ లోచనలో పడ్డారు. కొంత మంది జాతకాలు చూపించుకుంటుండగా, మరికొంత మంది దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నారు. బడా వ్యాపారులు, చిన్నాచితక వ్యాపారులు చేసే వారు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారులు, నిరుద్యోగులు సైతం ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్యం టెండర్లు దాఖలు చేశారు. ఒక్కో టెండర్కు ప్రభుత్వ ఫీజు రూ.2 లక్షలు. దీంతో కొంత మంది సిండికేట్గా మారి తలా రూ. లక్ష లేదంటే రూ.2 లక్షల చొప్పున వేసి టెండర్లు దాఖలు చేశారు.
ధనవంతుడైతే సొంతంగానే టెండర్లు సమర్పించారు. ఖమ్మం జిల్లాలో ప్రముఖ డాక్టర్లు బినామీ పేర్లతో తెర వెనుక ఉండి టెండర్లు వేశారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో మద్యం వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి ఏకంగా 3 వందల దరఖాస్తులు వేసినట్టు సమాచారం. రాజకీయాల్లో ఉన్న కొంతమంది బడాచోట నాయకులు కూడా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. దాంతో పాటు మహిళాల పేర్ల మీద కూడా టెండర్లు వేశారు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో చాలా మంది ఆశావహులు వచ్చిన అవకాశాన్ని చేజార్చకోకుండా మద్యం టెండర్ లో పాల్గొన్నారు. 2021 సంవత్సరంలో కంటే 2023 ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. 2021లో ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు 6212 దరఖాస్తులు రాగా, 2023లో 7207 దరఖాస్తులు వచ్చాయి. అంటే అదనంగా 995 దరఖాస్తులు దాఖలయ్యాయి. తగ్గేది లేదంటూ ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు.
ఖమ్మం-1, ఖమ్మం-2 స్టేషన్ పరిధిలో ఎక్కువ దరఖాస్తులు
ఖమ్మం నగరం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎక్సైజ్ స్టేషన్లో కూడా ఆదాయాన్ని సమకూర్చింది. ఖమ్మం-2 స్టేషన్ పరిధిలో ఉన్న 36 నెంబర్ షాపునకు 149 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం స్టేషన్-1 పరిధిలో ఉన్న 3వ నెంబర్ షాపునకు 142.., 45వ నెంబర్ కు 139... 5వ నెంబర్ షాపునకు 134...20 నెంబర్ షాపునకు 131 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా ఖమ్మం నగరంలోని స్టేడియం ఎదురుగా ఉన్న 13వ నెంబర్ షాపునకు గతంలో 51 దరఖాస్తులు రాగా ఇప్పుడు 51 వచ్చాయి. అదేవిధంగా సత్తుపల్లి స్టేషన్
పరిధిలోని 110వ నెంబర్ షాపునకు గతంలో 44 దరఖాస్తులు వస్తే ఈ సారి కూడా 44 దాఖలయ్యాయి. సింగరేణి మండలంలోని 113వ షాపు నెంబర్ కు గతంలో 37 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 47 దరఖాస్తులు వచ్చాయి. అంటే 10 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో ఖమ్మం జిల్లాలో 2894 దరఖాస్తులు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరింది. సోమవారం జరిగే డ్రా లో అదృష్టం ఎవరికి తలుపు తడుతుందో వేచి చూడాల్సిందే.
నేడు మద్యం దుకాణాలకు డ్రా ప్రక్రియ..
ఖమ్మం జిల్లాలో 122 షాపులకు డ్రా ప్రక్రియ కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలోని సీక్వెల్ రీస్టార్ట్ లో ఏర్పాట్లు చేశారు. ఈ డ్రా కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ డ్రా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. మద్యం దుకాణాల డ్రా ప్రకియకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీక్వెల్ ప్రాంతంలో వాహనాలు లోపలకు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.